Breaking News

డా.విజయ్ కుమార్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి

సామాజికసారథి మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక ఎంవీస్ ప్రభుత్వడిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్​ ఎం.విజయ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్​ నవీన్ మిట్టల్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉత్తర్వులు అందిన సందర్భంగా ఎంవీస్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్​ విజయ్ కుమార్ డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.