Breaking News

దాతలు ముందుకు రావాలి

దాతలు ముందుకు రావాలి

సామాజిక సారథి, షాబాద్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువత, పలువురి దాతలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ది కార్యక్రమాల కల్పనకై దాతలు ముందుకస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవాళ్లమవుతామన్నారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులు విద్యార్థులకు ఐడి కార్డ్స్, టై అండ్ బెల్ట్, కుమార్ వాటర్ ట్యాంక్, బుచ్చయ్య గ్రీన్ బోర్డ్, రవి, శ్రీకాంత్ సౌండ్ బాక్స్, రాజు సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శకుంతల పాండు, ఎంపీటీసీ రామస్వామి, పీ ఆర్టీయూ షాబాద్ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ, పాఠశాల హెచ్ఎం సింహాద్రినాయుడు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.