Breaking News

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

సారథి, రామడుగు: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ రామడుగు మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఎన్టీఆర్ 98వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి కూడు, గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతావస్త్రాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, భారీ గృహనిర్మాణ పథకం వంటి ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయసాధన కోసం పునరంకితం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వైస్ ఎంపీపీ పూరేళ్ల గోపాల్ గౌడ్, అనుపురం వెంకటేష్ గౌడ్, పూరెళ్ల మనోజ్ గౌడ్, గంటె మనోజ్, అనుపురం శ్రీనివాస్, జవాజి సందీప్, మామిడిశెట్టి సురేష్ పాల్గొన్నారు.