Breaking News

వర్మకు తెలంగాణ సర్కార్​ షాక్

వర్మకు తెలంగాణ ప్రభుత్వం షాక్​

సంచలన దర్శకుడు రాంగోపాల్​ వర్మకు తెలంగాణ ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. ఓ ప్రభుత్వ స్థలంలో అతడు ‘పవర్​స్టార్​’ సినిమా పోస్టర్​ను అంటించినందుకు రూ. 4000 జరిమానా విధిచింది. రాంగోపాల్​వర్మ ఇటీవల పవర్​స్టార్​ అనే సినిమాను ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు జీహెచ్​ఎంసీకి చెందిన స్థలంలో పోస్టర్​ను అంటించాడు. దీనిపై ఓ వ్యక్తి జీహెచ్​ఎంసీకి ఫిర్యాదు చేశాడు. అతడు పవర్​స్టార్​ హార్డ్​కోర్​ ఫ్యాన్​ అని సమాచారం. దీంతో ప్రభుత్వ ఆస్తుల్లో పోస్టర్ అంటించినందుకు జీహెచ్​ఎంసీ జరిమానా విధించింది.