Breaking News

61వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 61,408 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరుకుంది. తాజాగా 836 మంది వైరస్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 57,542 కు చేరింది. 57,468 మంది కోవిడ్‌ పేషంట్లు ఆదివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 23,38,036 కు చేరింది. ప్రస్తుతం 7,10,771 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కరోనా బాధితుల్లో రికవరీ రేటు 75.27 శాతంగా ఉందని తెలిపింది.