సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం నర్సాపూర్ లో మున్సిపాలిటీ ఆఫీసులో మున్సిపల్ కార్మికులకు కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్ డౌన్ పక్కాగా అమలు చేయడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలో […]
సూపర్ మార్కెట్లకు జనం అంతంత మాత్రమే సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. మారుతున్న కాలంలో సామాజిక జీవనంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నగర , పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పులు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంత కాలం సూపర్ మార్కెట్లలో కొనేందుకు ఆసక్తి చూపించిన ప్రజలు ఇప్పుడు తమ వీధి, తమ ఇళ్లకు సమీపంలో ఉన్న చిన్నచిన్న కిరాణ దుక్నాల్లో కొంటున్నారు. ఇంతకాలం అరకొరగా నడిచిన […]
సారథి న్యూస్, అచ్చంపేట: జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని 20వ వార్డు పేద ప్రజలకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వైస్ చైర్మన్ బంధంరాజు, రాజేందర్, ఎడ్ల నర్సింహగౌడ్, కౌన్సిలర్ అంతటి శివ పాల్గొన్నారు.
సారథి న్యూస్, నాగర్కర్నూల్: కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, సంబంధిత అధికారులు అలసత్వం, పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన వనపర్తి కలెక్టరేట్ నుంచి మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, అగ్రికల్చర్, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తప్పనిసరిగా కొనాలని సూచించారు. […]
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి జిల్లాపై నజర్ పెట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేటలో సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐజీ స్టీఫెన్ రవీంద్ర పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన మార్కెట్ బజార్ను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్, జిల్లా అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం సీఎస్ జిల్లా […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: జీవనోపాధి కోసం పొట్ట చేతబట్టుకుని జిల్లాకు వచ్చిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం, రూ.500 కచ్చితంగా పంపిణీ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6069 మంది వలస కూలీలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. వలస కార్మికులంతా జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు, ఇటుక బట్టీల్లో […]
మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన గ్యాడ్జెట్ ఇది ఆపదలో మహిళలకు వెంటనే సహాయం అందకపోవచ్చు. అలాంటప్పుడు చుట్టూ ఎవరూ ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో తోడుగా ఉన్న గ్యాడ్జెట్లే వారిని కాపాడుతాయి . మీకు సంబంధించిన అత్యవసర సందేశాన్ని ఆప్తులకు చేరవేస్తాయి. మీకు పర్సనల్వెపన్స్గా ఉపకరిస్తాయి. అలాంటి గ్యాడ్జెట్లు మహిళల కోసం.. పర్సనల్ అలారం * మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన గ్యాడ్జెట్ఇది. పర్సనల్అలారం రెస్ట్లెట్గా పిలిచే ఈ గ్యాడ్జెట్ను హ్యాండ్ బ్యాగ్లో […]
ఎండలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ వేసవిలో ఎండలు ఎక్కువవుతూనే ఉన్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. ఆరోగ్యపరంగా వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. *హిమోగ్లోబిన్శాతం చెక్చేసుకోవాలి. 10 కన్నా తక్కువ ఉన్నవారు ఎండ వేడిమిని తట్టుకోవడం కష్టమవుతోంది. – అధిక బరువు ఉన్నవారు కనీసం 3 నుంచి 5 కిలోల బరువు తగ్గాలి. బరువు ఎక్కువ ఉన్నవారిలో అధిక వేడి వల్ల రాషెస్ఎక్కువగా వస్తాయి. తక్కువ బరువు ఉన్నవారు. 2 […]