![15వేల మార్క్దాటిన కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/ts-2f-000-235.jpg?fit=745%2C434&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి 15వేల మార్క్ దాటింది. సోమవారం తాజాగా తెలంగాణలో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,394 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు, మేడ్చల్ జిల్లాలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.