అబుదాబి: ఐపీఎల్13లో కీలకమైన మ్యాచ్లో సన్రైజర్స్హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. రాయల్చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్రైజర్స్కీలక ఆటగాళ్లు కేన్ విలియమ్సన్(50 నాటౌట్; 44 బంతుల్లో 4×2, 6×2), హోల్డర్(24 నాటౌట్; 20 బంతుల్లో 4×3) జట్టుకు విజయాన్ని అందించడంలో చివరి దాకా నిలిచారు. వార్నర్(17; 17 బంతుల్లో 4×3)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సేపు క్రీజ్లో నిలువలేదు. మనీష్ పాండే(24; 21బంతుల్లో 4×3, 6×1) కొద్ది సేపు స్కోరు పరుగెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన ప్రియమ్గార్గ్(7) కూడా ఎంతోసేపు ఉండలేదు.
టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కోహ్లి(6) విఫలం కాగా, పడిక్కల్(1) వెనువెంటనే ఔట్అయ్యారు. ఆర్సీబీ జట్టులో ఏబీ డివిలియర్స్(56; 43 బంతుల్లో 4×5)హాఫ్ సెంచరీ చేయగా, అరోన్ ఫించ్(32; 30 బంతుల్లో 4×3, 6×1) మాత్రమే రాణించిగా, మొయిన్ అలీ(0), శివం దూబే(8), సుందర్(5).. తక్కువ పరుగులకే వెనుదిరిగారు. సన్రైజర్స్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు సాధించగా, నటరాజన్ రెండు వికెట్లు తీశాడు. నదీమ్కు ఒక వికెట్ దక్కింది. ఆదివారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్తలపడనుంది. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది.