Breaking News

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ తీసుకుంటారని నేను చెప్పడం లేదు. కానీ డ్రగ్స్​ తీసుకునే హీరోలు చాలా మంది నాకు తెలుసు.. వారు డ్రగ్స్​ వాడడాన్ని నేను కళ్లారా చూశాను. బాలీవుడ్​లో ఓ డైరెక్టర్​ ఉన్నారు. కొత్తవాళ్లను ఆయన చాలా ఎంకరేజ్​ చేస్తారు. ఆయన నా ముందే చాలాసార్లు డ్రగ్స్​ తీసుకున్నారు. ఓ సారి నాకు స్టోరీ వినిపిస్తానని ఆయన ఆఫీసులోని ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ నాకు పోర్న్​వీడియోలు చూపించాడు. ఆయన అప్పటికే చాలా మత్తులో ఉన్నాడు. నేను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను’ అంటూ ఓ టీవీ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది పాయల్​.