![సోనియా గాంధీ డిశ్చార్జ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/SONIAAAFF.jpg?fit=700%2C394&ssl=1)
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. జూలై 30న న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చేరారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. కాగా.. గత ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.