Breaking News

సూపర్​ ఓవర్లో బెంగళూరు విజయం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సోమవారం రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. బెంగళూరు సూపర్ ఓవర్లో విక్టరీ కొట్టింది. టాస్​ గెలిచిన ముంబై ఇండియన్స్​ బెంగళూరును బ్యాటింగ్​కు పంపింది. బెంగళూరు జట్టులో డివిలియర్స్ (25 బంతుల్లో 52 పరుగులు)కు శివమ్ దూబే (10 బంతుల్లో 27 పరుగులు) కొట్టడంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌లో దిగింది. అయితే ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్‌లతో పాటు సూర్యకుమార్ యాదవ్ పెవిలియం బాటపట్టారు. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 99 పరుగులు) భారీ ఇన్నింగ్స్‌కు పొలార్డ్(24 బంతుల్లో 60 పరుగులు) హిట్టింగ్ తోడవడంతో మ్యాచ్ టై అయింది.

బెంగళూరుకు కలిసొచ్చిన సూపర్​ ఓవర్​
సూపర్ ఓవర్‌లో ముంబై జట్టును బెంగళూరు బౌలర్ నవదీప్ సైనీ కట్టడి చేశాడు. దీంతో ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును డివిలియర్స్ రెండు ఫోర్లు కొట్టి గెలిపించాడు. దీంతో టోర్నీలో బెంగళూరు రెండో విజయం సాధించింది.