Breaking News

సుప్రీంలో పిటిషన్​ వాపస్​

సుప్రీంకోర్టు పిటిషన్​ వాపస్​

న్యూఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా పైలట్​ వర్గం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్​చేస్తూ స్పీకర్​ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆయన తన పిటిషన్​ను వెనక్కి తీసుకున్నారు.

రాజస్థాన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు న్యాయ పోరాటం వద్దని.. రాజకీయంగానే ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయంతోనే స్పీకర్ ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు సమాచారం. ఈ అంశంపై చర్చ వచ్చినప్పుడు నాయకులు రెండుగా చీలిపోయినట్లు సమాచారం. కొందరు న్యాయపోరాటమే మంచిదని అభిప్రాయపడగా మెజార్టీ నాయకులు కేసును ఉపసంహరించుకుని, రాజకీయంగా ఎదుర్కోవడమే సరైన నిర్ణయమని తేల్చిచెప్పారు.