Breaking News

సిటీలో ఫ్రీగా తాగునీటి సరఫరా

సిటీలో ఫ్రీగా తాగునీటి సరఫరా

సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. 20వేల లీటర్ల వరకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండా నీటిని సరఫరా చేసే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. శనివారం ప్రగతిభవన్ లో మంత్రి కె.తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ బిల్లులో 20వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.