Breaking News

సాగర్​ రింగ్ ​రోడ్డు ఫ్లైఓవర్ ప్రారంభం

సాగర్​రింగ్​రోడ్డు ఫ్లైఓవర్ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్‌: ఎల్‌బీ నగర్ సర్కిల్ ​పరిధిలోని సాగర్ ​రింగ్​రోడ్డు జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ​మాట్లాడుతూ.. గ్రేటర్​హైదరాబాద్​వాసుల ట్రాఫిక్​కష్టాలు తీరనున్నాయని చెప్పారు. ఈ ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని ఎస్సార్‌డీపీ ఫేజ్‌-1 ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో ప్రీకాస్ట్‌ విధానంలో నిర్మించారు. దేశంలోనే మొదటిసారి ప్రత్యేక టెక్నాలజీని ఈ నిర్మాణంలో వినియోగించినట్టు చెప్పారు. కాగా, ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సికింద్రాబాద్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మీదుగా శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే వైపునకు, అలాగే నాగార్జున సాగర్‌ హైవే వైపునకు వెళ్లేవారికి ట్రాఫిక్​ ఇబ్బందులు తీరనున్నాయి.