Breaking News

శ్రావణి కేసులో షాకింగ్​ నిజాలు!

టీవీనటి శ్రావణి ఆత్మహత్యకేసు ఓ కొలిక్కివచ్చినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో మెదటి నుంచి శ్రావణి టిక్​టాక్​ ఫ్రెండ్​ దేవరాజ్​రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్​ సాయికృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్​ఎక్స్​ 100 సినిమా నిర్మాత అశోక్​రెడ్డి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవి.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన శ్రావణి కుటుంబం ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో ఉంటున్నది. వీరి కుటుంబానికి సాయికృష్ణారెడ్డి మొదట పరిచయం అయ్యాడు. అతడు శ్రావణికి పలు సినిమాల్లో అవకాశం ఇప్పించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే శ్రావణికి టిక్​టాక్​లో దేవ్​రాజ్​రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి వివాహానికి సాయికృష్ణారెడ్డితోపాటు శ్రావణి కుటుంబసభ్యులు కూడా అడ్డుపడ్డారు. అంతేకాక గతంలో శ్రావణిపై ఒత్తిడి తీసుకొచ్చి దేవ్​రాజ్​పై కేసుకూడా పెట్టించారు. అయినప్పటికీ శ్రావణి.. దేవరాజ్​నే ఇష్టపడుతోంది. ఈ క్రమంలో శ్రావణి ఇంట్లో గొడవలు చెలరేగాయి. మరోవైపు దేవరాజ్​ కూడా శ్రావణిని పెళ్లిచేసుకొనేందుకు నిరాకరించడంతో తీవ్ర నిరాశకు లోనేన శ్రావణి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసును ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తైతే పూర్తివివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సాయికృష్ణారెడ్డి, దేవరాజ్​రెడ్డి పోలీసుల అదుపులో ఉండగా ఆర్​ఎక్స్​ 100 సినిమా నిర్మాత అశోక్​రెడ్డి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.