![వీఆర్డీఎల్ పనుల పరిశీలన](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/sklm2.jpg?fit=1280%2C960&ssl=1)
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్(వీఆర్డీఎల్)ను శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకాధికారి శశిభూషణ్ రావు, కలెక్టర్ జె.నివాస్ బుధవారం పరిశీలించారు. సిబ్బంది నియామక ప్రక్రియను కంప్లీట్ చేయాలని సూచించారు.
ఇక్కడ ల్యాబ్ను ఏర్పాటు చేయడంతో కరోనా పరీక్షల ఫలితాలను ఇక్కడే పొందవచ్చన్నారు. కాకినాడకు వెళ్లే అవసరం ఉండదన్నారు. అనంతరం జిల్లా కోవిడ్ ఆస్పత్రి జెమ్స్ ను పరిశీలించారు. ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రంలోని వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలంతా ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కలెక్టర్ జె.నివాస్ సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాష్ట్ర టెలీ మెడిసిన్ హెల్ప్ లైన్ 14410 నంబర్ కు ఫోన్ చేయొవచ్చన్నారు. అలాగే 9490576658 నంబర్కు ఫోన్ చేయొచ్చన్నారు. వారి వెంట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ఏ.కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.కృష్ణవేణి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సాయిరాం, ఎస్ డీసీ ఆర్.గణపతి, కోవిడ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ ప్రవీణ్, శివానీ ఉన్నారు.