Breaking News

విమానం ముక్కలు.. 19 మంది మృతి

కేరళలో ఘోర విమానప్రమాదం

తిరువనంతపురం: దుబాయ్​ నుంచి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్​కు వస్తున్న ఓ ఎయిర్​ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం లోయలోపడి రెండు ముక్కలు కావడంతో పైలట్​, ఐదుగురు సిబ్బందితో పాటు మరో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఎయిర్​ ఇండియాకు చెందిన డీఎక్స్ ​బీ​సీసీజే బోయింగ్​ 737 విమానం రన్​వే పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విమానంలో 174 మంది ప్రయాణికులు, ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. రన్​వే పైకి నీరు రావడంతోనే ప్రమాదం జరిగిఉండవచ్చని ఎయిర్​పోర్టు అథారిటీ అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్​ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధాని కేరళ సీఎం పినరయి విజయన్​కు ఫోన్​చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.