Breaking News

వికాస్​దూబే అనుచరుడు హతం

లక్నో: యూపీలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన గ్యాంగ్​స్టర్​ వికాస్​దూబే ప్రధాన అనుచరుడు అమర్​దూబేను పోలీసులు కాల్చిచంపారు. ఉత్తర్​ప్రదేశ్​ హమీర్​పూర్​ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లారు. దీంతో అతడు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అమర్​ హతమయ్యాడని ఆరాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్​కుమార్​ వెల్లడించాడు. అమర్​దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది. కాగా వికాస్​దూబే కోసం 40 ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయి. ఉత్తరాఖండ్​ లేదా హరియానా రాష్ట్రంలో వికాస్​ దూబే తలదాచుకున్నట్టు సమాచారం.