Breaking News

వరుడు ఐసోలేషన్‌లో..వధువు క్వారంటైన్‌లో!

సారథిన్యూస్​, వెల్దుర్తి: పెళ్లయిన రెండోరోజే వరుడిని ఐసోలేషన్​కు, వధువును క్వారైంటైన్​కు తరలించిన ఘటన ఏపీలోని కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకున్నది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. కాగా అతడికి వెల్దుర్తి మండలం ఎల్​ తండాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులు అతడి నమూనాలు సేకరించారు. అయినప్పటికి యువకుడు ఈ నెల 10న ఎల్​ తండాకు వచ్చి అక్కడ యువతిని వివాహం చేసుకున్నాడు. అదే రోజు అతడు అస్వస్థతకు గురయ్యాడు. వైద్యపరీక్షల్లోనూ అతనికి కరోనా పాజిటివ్‌గా తెలిసింది. దీంతో పోలీసులు ఆ గ్రామాన్ని కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించి.. వివాహానికి హాజరైన 70 కుటుంబాలను క్వారైంటైన్​కు తరలించి వారి నమూనాలు సేకరించారు.