Breaking News

‘రైతుబీమా’ గొప్పపథకం

సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అన్నదాతల పాలిట గొప్పవరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం లేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన దుర్గం రములు అనే రైతు ఇటీవలే చనిపోగా అతడి కుటుంబానికి బుధవారం ఎమ్మెల్యే రైతు బీమా ప్రొసీడింగ్స్​ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్​ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, సర్పంచ్ గుండి మానస, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్లా వెంకట్ రెడ్డి, టీఆర్​ఎస్​ నేతలు గంట్లా జితేందర్ రెడ్డి, జూపాక కర్ణాకర్, ఎంపీటీసీ శ్యాం, ఏడీ రామారావు, ఏవో యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.