Breaking News

రియా జవాబులకు సీబీఐ షాక్​!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసులో రియాచక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది. కాగా రియాచక్రవర్తిని సీబీఐ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు రియా తడబడ్డట్టు సమాచారం. రియా చెబుతున్న సమాధానాలతో సీబీఐ అధికారులే షాక్​కు గురవుతున్నారట. అక్కడ ఆమె ప్రతి ప్రశ్నకు నాకేం తెలియదు అని సమాధానం చెబుతుండటంతో ఆమె నటనకు షాక్​ అవుతున్నారట. ముఖ్యమైన ప్రశ్నలన్నింటికి ఆమె సమాధానం చెప్పకుండా దాటవేస్తుందట. దీంతో సీబీఐ అధికారులకు ఆమెపై అనుమానాలు బలపడుతున్నాయి. సీబీఐ అధికారులు ఆమెను 50 ప్రశ్నలు అడుగగా ఆమె కేవలం రెండింటికే సమాధానం చెప్పిందట. ఆదివారం ఆమెను సీబీఐ అధికారులు మరోసారి విచారించనున్నారు. సుశాంత్​తో మీరు ఎప్పడు బ్రేకప్​ చేసుకున్నారు? అని సీబీఐ ప్రశ్నించగా.. జూన్​ 8న బ్రేకప్​ చేసుకున్నట్టు రియా చెప్పిందట. అయితే మీరు ఏకారణంతో విడిపోయారు? విడిపోయాక కూడా సుశాంత్​ మీ సోదరుడికి ఎందుకు కాల్​ చేశారు? జూన్​ 8న మీరు విడిపోతే జూన్​ 14 వరకు అతడి గురించి ఎందుకు పట్టించుకున్నారు? తదితర ప్రశ్నలు సీబీఐ అడిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు రియా దాటవేత దోరణినితో సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం.