![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/TRS-PARTY-FFF.jpg?fit=581%2C400&ssl=1)
సారథిన్యూస్, రామగుండం: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని.. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. మంగళవారం ఆయన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు ఇంచార్జిలను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఇంచార్జ్లు పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.