![RAMAYAMPETA1](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/RAMAYAMPETA1.jpg?fit=1032%2C774&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: హైదరాబాద్కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా మారుమూల పట్టణాలకు విస్తరిస్తున్నది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పట్టణంలో ఆంక్షలు విధించారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇటీవల హైదరాబాద్లో ఓ విందుకు హాజరైనట్టు అధికారులు అనుమానిస్తున్నారు.