Breaking News

యూపీలో రెచ్చిపోయిన రౌడీలు

లక్నో: ఉత్తర్​ప్రదేశ్​లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్​ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్​కు చెందిన రౌడీ షీటర్​ వికాస్​ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్​ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్​ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్​ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్​ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వికాస్​ దూబేపై దాదాపు 60 క్రిమినల్​ కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్​ విచారం వ్యక్తం చేశారు. నేరస్థులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆ