Breaking News

యాసంగిలో ఏయే పంటలు వేద్దాం

యాసంగిలో ఏ పంటలు వేద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.

‘కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శనివారం సమావేశంలో ఈ విషయంపై కూడా విస్త్రతంగా చర్చ జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా ముప్పు ఇంకా ఉండడంతో రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తలను కోనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సమావేశంలో సమీక్షిస్తారు.