Breaking News

మొహర్రంపై మంత్రుల సమీక్ష

మొహర్రంపై మంత్రుల సమీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రంపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్రహోంశాఖ మంత్రి మహమూద్ అలీ డీఎస్ఎస్ భవన్ లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ బాషాఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం, జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్ బాబాఫసియోద్దీన్, మైనారిటీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం పాల్గొన్నారు.