Breaking News

మేయర్​ బొంతు రామ్మోహన్​కు కరోనా

జీహెచ్​ఎంసీ మేయర్​ రామ్మోహన్​కు కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఏవీ లేకపోయినా ఆయనకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో మేయర్ హోం క్వారంటైన్​లో ఉంటున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని మేయర్​ ట్వీట్​ చేశారు.