Breaking News

మాట నిలుపుకున్న కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్​: మంత్రి కేటీఆర్.. తన జన్మదినం సందర్భంగా ప్రభుత్వానికి ఆరు కోవిడ్​ రెస్పాన్స్​ అంబులెన్స్​లను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంబులెన్స్​లను గురువారం హైదరాబాద్​లో ప్రగతి భవన్​లో మంత్రులు ఈటల రాజేందర్​, కేటీఆర్​ జెండా ఊపి ప్రారంభించారు. కాగా మంత్రి కేటీఆర్​ స్ఫూర్తితో ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు వందకు పైగా అంబులెన్స్​లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని కేటీఆర్​ పేర్కొన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్​లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, బాల్క సుమన్, కేటీఆర్​ సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య పాల్గొన్నారు.