Breaking News

మాజీఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్‌

మాజీఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్‌

సారథి న్యూస్​, హైదరాబాద్​: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు బెదిరింపు ఫోన్​కాల్​ వచ్చింది. గతనెల 25న ఇంటర్​నెట్​ వాయిస్​ బేస్డ్​ కాల్​ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగంతుకుడు తనకు ఫోన్ చేసి బెదిరించాడని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్లు అందుబాటులోకి రాలేదని, చివరికి హాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
డీజీపీ అందుబాటులోకి రాలేదు
12 రోజులైనా తన ఫిర్యాదుపై ఎలాంటి పురోగతి లేదని, మాజీ ఎమ్మెల్సీగా తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల సంగతేంటని కె.నాగేశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసమస్యలపై గళం వినిపిస్తానని కె.నాగేశ్వర్ స్పష్టం చేశారు.