Breaking News

హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి లాక్‌డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. కాగా తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.