Breaking News

భట్టి ర్యాలీకి నీరాజనం

భట్టి ర్యాలీకి నీరాజనం

  • ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న వందల ట్రాక్టర్లు
  • కాంగ్రెస్ నాయకుల ఐక్యత రాగం
  • కదలొచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం
  • సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సారథి న్యూస్​, మధిర, ఖమ్మం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో బుధవారం చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ర్యాలీకి ప్రజలు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలో భట్టి బృందానికి పూలు జల్లుతూ.. డప్పులతో మోత మోగిస్తూ ఘనస్వాగతం పలికారు. మధిరలో మొదలైన ర్యాలీకి ప్రతి గ్రామంలో రైతులు తమంతకు తాముగా చేరారు. ఒకానొక దశలో ర్యాలీ అనుకన్న సమయం కన్నా ఆలస్యంగా ముందుకు సాగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న వేలాదిగా పాల్గొన్న రైతులు, కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు