![బీడీ కార్మికులను ఆదుకోవాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/beedi.jpg?fit=677%2C300&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని
తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదారి మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేటలో ప్యాకింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతన ఒప్పందం ముగిసి దాదాపు ఆరు మాసాలు గడుస్తున్నా బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందం చేయకుండా కార్మికులను దోపిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బండారి కుమార్, లక్ష్మణ్, బి రాజు, జి స్వామి, నాయిని రాజు, బండారి చంద్రం, నవీన్ కుమార్, బట్టి స్వామి, గంప చాట్ బట్టి ప్యాకింగ్ కార్మికులు పాల్గొన్నారు.