Breaking News

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్​

సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరీంనగర్​ జిల్లా రామడుగులోని పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఒంటెల కరుణాకర్​రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాచరికపాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. పోలీసులు ముందస్తు అరెస్ట్​చేసిన వారిలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్, బీజేవైఎం మండలాధ్యక్షుడు రమేశ్​గౌడ్, ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ గౌడ్, తిర్మలపూర్ ఎంపీటీసీ మోడీ రవీందర్, నాయకులు కొత్త వెంకటేశ్​, కారుపాకల అంజిబాబు, జిట్టవేని అంజిబాబు, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, నరేశ్​, శివరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజు, అశోక్ రెడ్డి, రామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.