![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/HYDERABADDD-THHHFF.jpg?fit=729%2C328&ssl=1)
సారథిన్యూస్, నిజాంపేట: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకరన్న బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం శంకరన్న 10వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ.. విజయ్కుమార్ నిజాయితీ పరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ కొమ్మట బాబు లక్ష్మీ, దళితసంఘాల నేతలు నరసింహులు దుబాసి సంజీవ్ గెరిగంటి బాబు టంకరిలక్ష్మణ్ బజార్ రంజిత్ గౌడ్ జి పి స్వామి తాడెం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.