![రాజధాని మార్పు అప్రజాస్వామికం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/JANASENAAA-APPPFF.jpg?fit=700%2C437&ssl=1)
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ విమర్శించారు. సీఎం జగన్ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అంతే కానీ రాజధానిని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారగానే రాజధానులు మార్చుకుంటే పోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. రాజధాని విషయంలో జనసేన పార్టీ విధానంలో ఏ మార్పు లేదని.. అమరావతి రాజధానిగా ఉండాలన్నదే తమపార్టీ అభిమతమని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. జనసేన అమరావతి రైతుల పక్షానే నిలబడుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.