Breaking News

ప్రతి సమాచారం మీ వద్ద ఉండాలి

ప్రతి సమాచారం మీ వద్ద ఉండాలి

సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ కే భవన్ లో అన్నిశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నిశాఖలు తమకు సంబంధించిన సమగ్ర సమాచారం తయారు చేయాలని, శాసనమండలి, శాసనసభలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. మండలిలోనూ సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని ఆదేశించారు. సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోటీసును సిద్ధం చేసుకోవాలని వివరించారు.