Breaking News

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి కరోనా

ప్రణబ్​ముఖర్జీకి కరోనా

ఢిల్లీ: కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రి అమిత్​షాకు కరోనా సోకగా.. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు ప్రణబ్​ ముఖర్జీకి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. ‘నేను రెగ్యులర్​ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టులు చేయించుకోగా నాకు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. గత వారంరోజులుగా అన్ని కలిసిన వారంతా దయచేసి పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.