Breaking News

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, కర్నూలు: కరోనాపై యుద్ధంలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా ఉంటూ కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని కర్నూలు ఎస్పీ డాక్టర్​ ఫక్కీరప్ప అన్నారు. కరోనా బారినపడి మృతిచెందిన పోలీస్​ హెడ్​కానిస్టేబుల్​ ఎస్​ఏ మాలిక్​బాషా కుటుంబసభ్యులకు 1993 బ్యాచ్​ పోలీసులు సేకరించిన రూ.లక్ష సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసుశాఖ నుంచి వచ్చే బెనిఫిట్స్​ త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.