![31వరకు లాక్డౌన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/peta-2f.jpg?fit=677%2C261&ssl=1)
సారథి మీడియా, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 31 వరకు లాక్డౌన్ కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పెద్ధశంకరంపేటలోని పద్మయ్య పంక్షన్హాల్లో మండల ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమయ్యారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్, ఎస్సై, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షడు కుంట్ల రాములు, మండల పరిషత్ ఉపాధ్యక్షడు రమేష్ పాల్గొన్నారు.