Breaking News

పెండింగ్ కేసులు క్లియర్​ చేయండి

పెండింగ్ కేసులు పరిష్కరించండి

సారథి న్యూస్, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్​స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని, ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం పోలీసు కమిషనర్లు, ఆయా జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్​ కేసులను సమీక్షించడం ద్వారా కేసులు సంఖ్య తగ్గించేలా కృషిచేయాలన్నారు. నిందితులకు శిక్షపడేలా కృషిచేసిన ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అభినందించారు. లాక్ డౌన్ వల్ల సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరిగిపోయిందన్నారు. ఈ తరహా నేరాలపై నిఘా ఉంచాలన్నారు. ఖమ్మం నుంచి వీడియోకాన్ఫరెన్స్​లో పాల్గొన్న ఎస్పీ తఫ్సీర్​ఇక్బాల్​ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను క్లియర్ చేసేలా ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీసీఆర్ బీ ఏసీబీ సీఎల్​నాయక్, సీఐ శివసాంబిరెడ్డి పాల్గొన్నారు.

వీడియోకాన్ఫరెన్స్​లో పాల్గొన్న ఎస్పీ తఫ్సీర్ ​ఇక్బాల్