Breaking News

పార్టీకాదు..అభివృద్ధే ముఖ్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: అభివృద్ధి కోసం అవసరమైతే రాజకీయాలను పక్కన పెడతానని కరీంనగర్​ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హుస్నాబాద్​ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. వానాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు శ్రీనివాస్, వేణు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విజయ పాల్ రెడ్డి, నాలుగు మండలాల అధ్యక్షులు వీరాచారి, వెంకటేశ్​, చిరంజీవి, శంకర్ బాబు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి తిరుమల, మోహన్ నాయక్, సాగర్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.