Breaking News

పల్లెటూరు పిల్లగా రకుల్​

రకుల్​ ప్రీత్​సింగ్​ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు గ్లామరస్​ పాత్రలనే చేశారు. ప్రస్తుతం ఓ చిత్రంలో పల్లెటూరు పడుచు పిల్లగా మెరిపించనున్నది. ఇప్పటికే ఈ తరహా పాత్రను రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ కూడా సమంతా బాటపట్టారు. సాయితేజ్​ తమ్ముడు వైష్ణవ్​ తేజ్​ హీరోగా డైరెక్టర్​ క్రిష్​ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్​ పేదంటి గ్రామీణ యువతిగా నటిస్తున్నది. పూర్తి ఫారెస్ట్​ బ్యాక్​డ్రాప్​లో సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం వికారాబాద్​ అడవుల్లో షూటింగ్​ కొనసాగుతుంది. నవంబర్ నాటికి ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నారట.