Breaking News

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్​, నిజాంపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని మెదక్​ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన నిజాంపేటలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తే వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆయాగ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.