Breaking News

పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

దుబాయ్​: టీ20 మ్యాచ్​ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్​ టై కాగా, సూపర్ ఓవర్‌ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్‌ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా ముంబై ఇండియన్స్​, కింగ్స్ ​ఎలెవన్​ పంజాబ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్​ మధ్య పంజాబ్​ విజయం సాధించింది.

అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేయడంతో మ్యాచ్​ టైగా ముగిసింది. దీంతో సూపర్​ ఓవర్​ అనివార్యమైంది. కేఎల్‌ రాహుల్‌ (77;51 బంతుల్లో 4×7, 6×3) దుమ్ములేపాడు. లక్ష్య ఛేదనలో కింగ్స్‌ పంజాబ్‌ ఆదిలోనే మయాంక్‌ అగర్వాల్‌ (11) వికెట్‌ కోల్పోయింది. క్రిస్‌ గేల్‌(24; 21 బంతుల్లో 4×1, 6×2), నికోలస్‌ పూరన్‌(24; 12 బంతుల్లో 4×2, 6×2) స్కోరు బోర్డును పరుగెత్తించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు, ఆర్​డీ చాహర్​ రెండు వికెట్ల చొప్పున తీశారు.

ముందుగా టాస్​ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. రోహిత్​శర్మ 9, డికాక్​ (53, 43 బంతుల్లో 3×4), హార్దిక్​ పాండ్యా 34( 30 బంతుల్లో, 4×1, 6×1), కేఏ పొలార్డ్​(34, 12 బంతుల్లో 4×1, 6×4), కట్లర్​నీలే (24, 12 బంతుల్లో 4×4) పరుగులు చేయగా, మిగతావారు రెండెంకల స్కోరును దాటలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక కింగ్స్​ లెవెన్​ పంజాబ్​ బౌలర్లలో మహ్మద్​ షమీ, అర్షద్​దీప్​ సింగ్​ రెండు వికెట్ల చొప్పున, జోర్డన్​, రవిబిష్ణోమ్​ఒక్కో వికెట్​ చొప్పున తీశారు.

సూపర్ ​ఓవర్ ​సాగిందిలా..
ముందు జరిగిన సూపర్‌ ఓవర్‌ టై కావడంతో రెండో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. తొలి సూపర్‌ ఓవర్‌లో రెండుజట్లు ఐదు చొప్పున సమానంగా పరుగులు చేయడంతో రెండో సూపర్‌ ఆడించారు. ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని పంజాబ్​ ఛేదించింది.