Breaking News

నటాషా సూరికి కరోనా

కరోనా నటషాకు కరోనా

మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోంక్వారంటైన్​లో ఉండి చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఆమె ముంబై నుంచి పుణె వెళ్లింది. తర్వాత ఆమెకు గొంతునొప్పి, తీవ్రజ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వచ్చినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం తన కుటుంబసభ్యుల కూడా క్వారంటైన్​లో ఉన్నారని చెప్పారు. నటాషా సూరి 2016 మలయాళ సినిమా ‘కింగ్ లయర్’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఆమె బిపాషా బసు, కరణ్ సింగ్‌ గ్రోవర్‌తో కలిసి ‘డేంజరస్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఎంఎక్స్​ ప్లేయర్‌లో ప్రసారం కానుంది. విక్రమ్ భట్ రాసిన ఈ వెబ్ సిరీస్.. భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆగస్టు 14 న ప్రీమియర్ కానుంది.