Breaking News

దేశవ్యాప్తంగా 76వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ : కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 76,472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 34,63,973 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 1,021 మంది కరోనాతో మృతిచెందారు. కాగా ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 62,550కు చేరింది. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అధికంగానే ఉంది. వైరస్‌ బారినపడ్డ వారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే బయటకు రావాలని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ తెలిపింది.