Breaking News

దూదేకుల సంఘం ఎన్నిక

సారథి న్యూస్,రామాయంపేట: మెదక్​ జిల్లా రామాయంపేట మండల దూదేకుల (నూర్బాష్​) సంఘాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్​గా ఖాసీం సాబ్​, కోకన్వీనర్​గా ఫిరోజ్​, కోశాధికారిగా ఇమామ్​ సాబ్​, సలహాదారుడిగా అహ్మద్​ పాషాను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, కోఆప్షన్ సభ్యుడు గౌస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మెదక్​ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండీ అజ్గర్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, జిల్లా నాయకులు ఇబ్రాహీం, బాబు మియా,గౌస్ పాషా, ముస్లిం సోదరులు హాబీబ్, అబ్దుల్, రషీద్ పాల్గొన్నారు.