Breaking News

తెలంగాణలో 2,817 కేసులు

తెలంగాణలో 2,817 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) 2,817 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో చేరిన కరోనా సంఖ్య 1,33,406కు చేరింది. తాజాగా వ్యాధిబారినపడి 10 మంది మృతిచెందారు. కరోనా మృతుల సంఖ్య 856కు చేరింది. వ్యాధి నుంచి తాజాగా 2,611 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,00,013 కు చేరింది. ప్రస్తుతం 32,537 యాక్టివ్​కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్​లో 25,293 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 452 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

ఇలా జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​36, భద్రాద్రి కొత్తగూడెం 89, జగిత్యాల 88, జనగాం 41, జయశంకర్ ​భూపాలపల్లి 26, జోగుళాంబ గద్వాల జిల్లా 33, కామారెడ్డి 62, కరీంనగర్​164, ఖమ్మం 157, మహబూబ్​నగర్​42, మహబూబాబాద్​62, మంచిర్యాల 71, మెదక్​35, మేడ్చల్​మల్కాజిగిరి 129, నాగర్​కర్నూల్​41, నల్లగొండ 157, నిజామాబాద్​97, పెద్దపల్లి 75, సిరిసిల్ల 53, రంగారెడ్డి 216, సంగారెడ్డి 76, సిద్దిపేట 120, సూర్యాపేట 116, వికారాబాద్​27, వనపర్తి 45, వరంగల్​రూరల్​46, వరంగల్​అర్బన్​114, యాద్రాద్రి భువనగిరి 73 చొప్పున పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.