Breaking News

తెలంగాణలో 2,392 కరోనా కేసులు

తెలంగాణలో 2,392 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24గంటల్లో) 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్న వారి సంఖ్య 24,579గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్​ కేసులు 31,670 మేర ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​33, భద్రాద్రి కొత్తగూడెం 95, జగిత్యాల 64, జనగామ 38, జోగుళాంబ గద్వాల జిల్లా 22, కామారెడ్డి 76, కరీంనగర్ ​157, ఖమ్మం 116, మహబూబ్​నగర్​ 45, మహబూబాబాద్ ​71, మంచిర్యాల 69, మెదక్ ​36, మేడ్చల్ ​మల్కాజిగిరి 132, ములుగు 20, నాగర్​కర్నూల్​ 53, నల్లగొండ 105, నిర్మల్​34, నిజామాబాద్​102, పెద్దపల్లి 68, రాజన్నసిరిసిల్ల 64, రంగారెడ్డి 191, సంగారెడ్డి 37, సిద్దిపేట 89, సూర్యాపేట 101, వనపర్తి 40, వరంగల్​అర్బన్ ​91, యాద్రాద్రి భువనగిరి 57 చొప్పున పాజిటివ్ ​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు హెల్త్​బులెటిన్​ను విడుదల చేశారు.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​