Breaking News

తెలంగాణలో 1,198 కేసులు

తెలంగాణలో 1,198 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 46,274 పాజిటివ్ ​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య 415కు చేరింది. ఇప్పటివరకు 11,003 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 510 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 106, మేడ్చల్​76, సంగారెడ్డి 10, వరంగల్​అర్బన్​73, కరీంనగర్​87, జగిత్యాల 36, మహబూబాబాద్ 36, మెదక్​13, మహబూబ్​నగర్​50, భూపాలపల్లి 26, నల్లగొండ 24, నాగర్​కర్నూల్​27, జనగాం 12, నిజామాబాద్​31, సూర్యాపేట 12 చొప్పున పాజిటివ్​కేసులు రికార్డు అయ్యాయి.